Bihar CM Nitish Kumar Trolled: బీహార్ సీఎం నితీష్ కుమార్ సోషల్ మీడియా ట్రోలింగ్కు గురైయ్యారు. బీహార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముందు మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 4000 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. దీంతో నితీష్ కుమార్ను విపరీతంగా ట్రోల్ చేశారు.
JD(U)కి సారథ్యం వహించి, మూడు నెలల కిందటే BJP నేతృత్వంలోని సంకీర్ణానికి తిరిగి వచ్చిన నితీష్ కుమార్.. నవాడా జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట్లాడారు.
వైరల్గా మారిన అతని ప్రసంగంలోని ఒక భాగంలో, నితీష్ కుమార్ ముందుగా “చార్ హజార్ సే భీ జ్యాదా (4,000 కంటే ఎక్కువ)” అని ఉచ్చరించారు. దానికి ముందు, “చార్ లక్ష (నాలుగు లక్షలు)” అని తడబడ్డారు. అంటే నితీష్ కుమార్ ఎన్నికల్లో “400 ప్లస్ టాలీ”ని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధమవుతోంది.
Also Read: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..
“ముఖ్యమంత్రి నాలుగు లక్షలకు పైగా ఎంపీలతో ప్రధానికి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. అప్పుడు అది చాలా ఎక్కువ అనిపించి.. 4,000 మంది సరిపోతారని ఆయన భావించారు” అని సారికా పాశ్వాన్ హిందీలో ట్వీట్ చేశారు.
माननीय मुख्यमंत्री नीतीश कुमार जी,मोदी जी को पहले 4 लाख MP देने की सोचे, फिर उन्हें लगा यह ज्यादा होगा, 4 हजार MP में काम चल जाएगा
मुख्यमंत्री जी आपका भी अभिनंदन
और आपका भी आभार !!
😂😂😂 pic.twitter.com/khREy79fww— Sarika Paswan (@SarikaPaswanRJD) April 7, 2024