Chandrababu: బీజేపీతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రావణరాజ్యాన్ని అంతం చేసేందుకే టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ ఎన్నికల్లో శవ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. శవ రాజకీయాలను అడ్డం పెట్టుకుని జగన్ వస్తుంటే.. రాష్ట్ర భవిష్యత్ కోసం తాను నాయకులతో కలిసి వస్తే తప్పేముందని ప్రశ్నించారు. రామాయణంలో రావణుడ్ని చంపడానికి రాముడితో కలిసి.. వానరసైన్యం పనిచేసిందని గుర్తు చేశారు. చివరికి రాముడికి ఉడత కూడా సాయం చేసిందని వెల్లడించారు.
పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అందుకే తాము బీజేపీతో పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలన పీడకలలాంటినదని చంద్రబాబు వైసీపీ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: సినిమా విలన్ క్యారెక్టర్లు అన్నీ కలిపితే చంద్రబాబు.. జగన్
ప్రస్తుత ముఖ్యమంత్రి స్వార్థంకోసం పనిచేస్తుంటే.. టీడీపీ మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేసిందని వెల్లడించారు. ప్రస్తుత ఇసుకాసురలను బోన్ లో పెట్టి ఇసుకను పేదలకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు.