Madhapur Cable Bridge Accident(Hyderabad latest news): మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా.. వారిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో ఇటీవల ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు తరచుగా నమోదవుతున్నాయి.