Indian Student Died in America(Telugu news headlines today): అమెరికాలో మరణిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. కారణం ఏదైనా అక్కడ మరణిస్తున్న ఇండియా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు న్యూయార్క్ లోని భారత్ కాన్సులేట్ వెల్లడించింది. ఓహియోలో ఉంటున్న గద్దె ఉమా సత్యసాయి అకాల మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి.. అతని మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : మరోసారి రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడ ఉంటున్న భారత విద్యార్థులకు భద్రత కరువైందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మరో విద్యార్థి మరణించడం మరింత ఆందోళనకు దారితీసింది. ఉమా సత్యసాయి అకాలమరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే హైదరాబాద్ కు చెందిన పాతికేళ్ల మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే విద్యార్థి మిస్సవ్వడం అతని కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నీల్ ఆచార్య, వివేక్ సైనీల ఘటనలు మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.
Deeply saddened by the unfortunate demise of Mr. Uma Satya Sai Gadde, an Indian student in Cleveland, Ohio.
Police investigation is underway. @IndiainNewYork continues to remain in touch with the family in India.
All possible assistance is being extended including to transport…
— India in New York (@IndiainNewYork) April 5, 2024