EPAPER

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule: ఇకపై విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదేనని సూచించింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం వారి ఇష్టమేనని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.


కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేశారు. ఇకపై విమానాల్లో మాస్క్ లు ధరించకపోయినా ప్రయాణికులకు ఎలాంటి జరిమానాలు , శిక్షలు ఉండవని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

దేశంలో బుధవారం 501 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 7,561 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. దీంతో విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. ఇప్పటికే కరోనా విషయంలో దాదాపు అన్ని నిబంధనలను కేంద్రం సడలించింది.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×