Election Commission Appointed IAS, IPS Officers In AP: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పలువురి అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమించిన అధికారులు ఈ రాత్రి 8 గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాలని ఆదేశించింది.
కొత్తగా నియమించిన వారిలో ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు, ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీ, అనంతపురం జిల్లా కలెక్టర్గా వి. వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్గా ప్రవీణ్ కుమార్లను నియమించింది ఈసీ. ఇక గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి షాక్.. కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు..
ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్ హఫీజ్లను నియమించింది ఈసీ.