34 Crore Seized in Andhra Pradesh During the Elections 2024: ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడుతోంది. ఓ వైపు పోలీసుల తనిఖీలు, మరోవైపు స్పెషల్ స్క్యాడ్లను మొహరించినా డబ్బు అక్రమంగా చలామనీ అవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నుంచి మార్చి చివరి నాటికి అంటే దాదాపు 15 రోజుల వ్యవధిలో 34 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు ఏపీ ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా తెలిపారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన ఏపీ ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా తనిఖీల్లో పట్టుబడిన వివరాలను వెల్లడించారు. కోడ్ వచ్చిన తరువాత చేపట్టిన తనిఖీల్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడింది. పది కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులు ఉన్నాయి. ఇదికాకుండా ఏడు కోట్ల మద్యం కూడా ఉందని తెలిపారు.
ఇప్పటివరకు 3300 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సీ -విజిల్ యాప్ ద్వారా 5500 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మతపరమైన ప్రచారాలు, నగదు, మద్యం ఇలా అనేక అంశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా. మరోవైపు కడప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లను సస్పెండ్ చేసినట్టు సమాచారం.