Fire accident in sangareddy(Telangana news live): సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్లో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరక్టర్ రవి, నలుగురు కార్మికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తo చేసిన ముఖ్యమంత్రి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.