Rajiv Gandhi assassination case Latest News: 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదబరిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీతోపాటు మరో 14 మంది మరణించారు. రాజివ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు శ్రీలంక వాసులు బుధవారం ఉదయం తమ స్వదేశానికి చేరుకున్నారు. మురగన్, రాబర్ట్ పయస్, జయకుమార్ ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 2022 నవంబర్ లో సుప్రీమ్ కోర్టు విడుదల చేసింది.
వీరు జైలులో సత్ర్పవర్తనతో ఉండడంతో శిక్షా కాలాన్ని తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అయితే ఆరోజు రిలీజైన తర్వాత తిరుచాపల్లిలో ఉన్న శరణార్ది శిబిరానికి తరలించారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం వారికి పాస్ పోర్ట్ మంజూరు చేయడంతో.. ఇవాళ లంక రాజధాని కొలంబోకు వెళ్లారు. పోలీసులు బృందం వారని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకెళ్లారు. చెన్నైలో ఉన్న శ్రీలంక హైకమీషన్ ఆ ముగ్గురికి ట్రావెల్ డాక్యుమెంట్లను అందజేసింది.
Also Read: బీజేపీలో చేరికపై సుమలత క్లారిటీ.. మాండ్యలో కుమారస్వామికి సపోర్ట్..
ఈ కేసులో నిందులుగా ఉన్న వారిలో ఒకరు మరణించారు. నిందుతుల్లోని భారతీయ పౌరురాలు నళినిని వారిలో ఒకరైన మురగన్ ను వివాహం చేసుకున్నారు. ఆమెకు మరణ శిక్ష విధించే సమయంలో గర్భవతి అని తేలడంతో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఆమె మరణ శిక్షను రద్దు చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె డాక్టర్.