Stock market updates(Business news telugu): అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లను కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా నష్టాల్లో కొనసాగుతోంది.
బుధవారం ఉదయం దేశీయ స్టాక్మార్కెట్ ప్రారంభమైంది. ఆదిలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 299 పాయింట్లు కోల్పోయి 73 వేల 600 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 90 యింట్లు నష్టపోయి 22 వేల 360 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అటు డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 83 రూపాయల 37 పైసలు వద్ద ప్రారంభమైంది.
ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
ముఖ్యంగా ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.