AAP MP Sanjay Sigh Gets Bail In Money Laundering Case(Telugu flash news): ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
మనీలాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ కేసులో సంజయ్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది అక్టోబర్ 4న అరెస్టు చేసింది. సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఈడీ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
సంజయ్ సింగ్ బెయిల్ మంజూరు చేయడానికి ముందు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం, ఆప్ నాయకుడు ఇప్పటికే ఆరు నెలల జైలు జీవితం గడిపాడు, సంజయ్ సిండ్ తదుపరి కస్టడీ అవసరమా లేదా అనే దానిపై కోర్టుకు తెలియజేయాలని ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ SV రాజుకు తెలిపింది. సంజయ్ సింగ్ వద్ద నుంచి ఎలాంటి డబ్బు రికవరీ కాలేదని, ఆయన రూ.2 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలను విచారణలో పరీక్షించవచ్చని కూడా బెంచ్ రాజుకు తెలిపింది.
గతంలో, సంజయ్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు, ముందస్తు నేరంలో తన పాత్ర ఏమీ లేదని వాదించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
ఈడీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించింది. 2021-22 పాలసీ కాలానికి సంబంధించి ఢిల్లీ మద్యం కుంభకోణంలో వివిధ కోణాల్లో సంజయ్ సింగ్ ప్రమేయం ఉందని పేర్కొంది.
ఆప్ నాయకుడు కిక్బ్యాక్లను పొందారని, అవి మద్యం పాలసీ ‘స్కామ్’ నుంచి వచ్చిన ఆదాయమని ఏజెన్సీ పేర్కొంది.
ఈడీ మనీలాండరింగ్ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) FIR నుంచి వచ్చింది. CBI, ED ప్రకారం, ప్రస్థుతం రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని సవరించేటప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. లైసెన్స్ హోల్డర్లకు అనవసరమైన సహాయాలు అందించారు.