AP Congress Candidates(Andhra pradesh election news): ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 114 అసెంబ్లీ స్థానాలకు, 5 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కడప ఎంపీగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల పోటీ చేయనున్నారు.
ఇక కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామపుల్లయ్య యాదవ్ ఎంపీ బరిలో నిల్చోనున్నారు.
అటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.