Chhattisgarh encounter: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.
ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనమిది మంది మావోలు మరణించారు. దాదాపు అరడజనుకు పైగా నక్సలైట్లు గాయపడినట్టు తెలుస్తోంది.
ఘటనాస్థలం నుంచి ఎల్ఎంజీ ఆటోమెటిక్ వెపన్స్, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా బలగాలు ఆ ప్రాంతంలో ఉన్నారు. పారిపోయిన మావోల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
మరోవైపు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లోని ఏడు జిల్లాల్లో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడిచిన నాలుగునెలల్లో జరిగిన ఎన్కౌంటర్లో 33 మంది మావోయిస్టులు మరణించారు. ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.