EPAPER

Chhattisgarh encounter: మళ్లీ కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..

Chhattisgarh encounter: మళ్లీ  కాల్పుల మోత.. ఎనమిది మంది మావోలు మృతి..

Chhattisgarh encounter 4 maoists killed


Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.

ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎనమిది మంది మావోలు మరణించారు. దాదాపు అరడజనుకు పైగా నక్సలైట్లు గాయపడినట్టు తెలుస్తోంది.


ఘటనాస్థలం నుంచి ఎల్‌ఎంజీ ఆటోమెటిక్ వెపన్స్, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా బలగాలు ఆ ప్రాంతంలో ఉన్నారు. పారిపోయిన మావోల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గడిచిన నాలుగునెలల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 33 మంది మావోయిస్టులు మరణించారు. ఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున మందుగుండు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×