Sri Ramakrishna Died at 74: తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ తన 74 ఏట కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామకృష్ణ ఆరోగ్య క్షీణించటంతో సోమవారం రాత్రి 8 గంటలకు తుదిశ్వాస విడిచారు. చెన్నై తేనాపేటలోని అపోలో హాస్పిటల్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
శ్రీరామకృష్ణ స్వస్తలం తెనాలి. కాగా, 50 ఏళ్ల కిందటే ఆయన చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. ముంబై, జెంటిల్మన్, చంద్రముఖి తదితర 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేసిన శ్రీ రామకృష్ణ బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
దర్శకులు మణిరత్నం, శంకర్ అన్ని చిత్రాలకు మాటలు రాసిన శ్రీరామకృష్ణ, రజనీకాంత్ దర్బార్ చిత్రానికి చివరిగా మాటలు అందించారు. ఆయన పార్థివ దేహానికి మంగళవారం ఉదయం సాలిగ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు గౌతం తెలిపారు. రామకృష్ణ మృతి చెందారన్న వార్త విన్న తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.