Fire Broke At Agri Godown: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వనపర్తి జిల్లా పెబ్బేరులోని రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
మంటల్లో దాదాపు 70 వేల వరి ధాన్యం బస్తాలు కాలి బూడిదయ్యాయి. వీటి విలువ సుమారు 15 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 40 లక్షల గన్నీ బ్యాగులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంతమేరా నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
వనపర్తి జిల్లా…
ఫెబ్బేరు మండలంలో బారీ అగ్ని ప్రమాదం….
మున్సిపల్ కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డులో చెలరేగిన మంటలు…
మంటల్లో కాలిపోయిన 70 వేల వున్న వరిధాన్యం బస్తాలు…
వరిధాన్యం సుమారు 15కోట్ల రూపాయల విలువ వుంటుందని అంచనా….
కాలి బూడిద అయిన 40 లక్షల గన్నీ… pic.twitter.com/Eb1m4FRsp2
— BIG TV Breaking News (@bigtvtelugu) April 1, 2024