Phone Tapping Case Radhakishan Rao Remand Report: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 గా ఉన్న మాజీ టాస్కఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు ఆదేశాలతోనే భవ్వ సిమెంట్ ఓనర్ ఆనంద్ ప్రసాద్ నుంచి రూ. 70 లక్షలు సీజ్ చేశామని రాధాకిషన్ రావు వెల్లడించారు. అటు దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ రావు, ఆయన బంధువుల నుంచి రూ. కోటి సీజ్ చేశామని ఆయన తెలిపారు.
ఇక మునుగోడు బై పోల్ సమయంలో కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి అనుచరుల వద్ద రూ. 3.50 కోట్లు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు.
ప్రణీత్రావు సమాచారం ఇవ్వడంతోనే నగదు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.