EPAPER

China: అరుణాచల్ ప్రదేశ్ పై డ్రాగన్ మరో కుట్ర.. 30 ప్రాంతాలకు చైనా పేర్లు..

China: అరుణాచల్ ప్రదేశ్ పై డ్రాగన్ మరో కుట్ర.. 30 ప్రాంతాలకు చైనా పేర్లు..
china news today
China

China arunachal pradesh news(Today’s breaking news in India): చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్ పై మరో వివాదాన్ని రేపింది. ఆ రాష్ట్రంలోని 30 ప్రాంతాలు తమ దేశంలో భాగంగా పేర్కొంది. వాటికి పేర్లు కూడా పెట్టేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి నిత్యం డ్రాగన్ వివాదాలను రేపుతోంది.


చైనా ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ లోని 30 ప్రాంతాలకు పేర్లు పెట్టినట్లు ఇటీవల ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. చైనా తమవిగా పేర్కొన్న వాటిలో 11 నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. 12  పర్వతాలు, 4 నదులు, సరస్సు, పర్వత మార్గం, మరో భూభాగం తమవేనని ఆ కథనంలో పేర్కొంది. ఆ 30 ప్రాంతాలకు చైనీస్, టిబెటన్, పిన్ యిన్ భాషల్లో పేర్లు పెట్టిందని తెలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని జాంగ్ నన్ ప్రాంతంపై చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఈ క్రమంలోనే డ్రాగన్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాంగ్ నన్ లో 30 ప్రాంతాలకు పేర్లు పెట్టింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.


Also Read:  మావల్లే ఆ విషయం బయటకు.. అది తప్పు..

అరుణాచల్‌ ప్రదేశ్‌  తమ దేశంలో భాగమని డ్రాగన్ చాలాకాలంగా వితండవాదం చేస్తోంది. ఈ క్రమంలో ఆ భూభాగాన్ని జాంగ్‌నన్‌ గా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి.  2017లో  6 ప్రాంతాలకు, 2021లో 15 ప్రాంతాలకు, 2023 ఏప్రిల్‌లో 11 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా వ్యవహార శైలిపై భారత్ అభ్యంతరం తెలిపింది. వాస్తవాలను ఎవరూ మార్చలేరని స్పష్టం చేసింది. పేర్లు పెట్టుకున్న మాత్రాన ఆ ప్రాంతాలు చైనాకి చెందవని తేల్చిచెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని కుండబద్దలు కొట్టింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ పర్యటనపైనా  చైనా అభ్యంతరం తెలిపింది. ఆ సమయంలో కూడా చైనాకు భారత్ ధీటుగా బదులిచ్చింది.

Tags

Related News

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Big Stories

×