PM Modi Comments on Electoral bonds(Telugu breaking news today): సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్లపై రచ్చ తీవ్రమైంది. దీనిపై బీజేపీలోకి కీలక నేతలు కౌంటరిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. బాండ్లపై వేడి కంటిన్యూ అవుతోంది. ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాలని భావించారు ప్రధాని నరేంద్రమోడీ. అందరూ బీజేపీ వైపు దృష్టి పెట్టడంతో తొలిసారి నోరువిప్పారు. ఈ అంశం బీజేపీకి ఎదురుదెబ్బగా భావించడం లేదన్నారు ప్రధాని.
ఆదివారం ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు ప్రధాని నరేంద్రమోడీ. బాండ్లు రద్దు చూసి ఎంజాయ్ చేస్తున్న పార్టీలు.. రాబోయే రోజుల్లో పశ్చాత్తాపం పడతారన్నారు. ముఖ్యంగా పార్టీలకు నిధుల రాక గురించి తెలిసిందంటే కేవలం ఎన్నికల బాండ్ల వల్లేనన్నారు. 2014 ముందు ఆ తరహా వివరాలను సేకరించారా అంటూ ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టారు. లోపాలు లేని వ్యవస్థలు ఉండవని, కానీ ఎప్పటికప్పుడు వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలన్నారు.
ఎన్నికల బాండ్లు ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని భావించిన సుప్రీంకోర్టు ఆ స్కీమ్ని రద్దు చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించింది. ఎన్నికల సంఘం ఆ వివరాలను పబ్లిక్ డొమెన్లో ఉంచింది. దీనికి ఆధారంగా కాంగ్రెస్తోపాటు పలు పార్టీలు.. అధికార బీజేపీని టార్గెట్ చేశాయి.