Kavitha interim bail petition(Telangana today news): ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె దాఖలు చేసిన మధ్యంతరం బెయిల్ పిటీషన్ సోమవారం విచారణకు రానుంది.
ముఖ్యంగా తన చిన్నకొడుక్కి పరీక్షలు నేపథ్యంలో బెయిల్ కావాలన్నది అందులో ప్రధానాంశం. పరీక్షల సమయంలో కుమారుడికి తన అవసరం ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అందులో ప్రస్తావించారు.
ఒకవేళ మధ్యంతర బెయిల్ రానిపక్షంలో జైలులో వసతులు కల్పించాలని మరోసారి న్యాయమూర్తిని కోరే అవకాశముంది. మార్చి 26న న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తిని కవిత కోరారు. ముఖ్యంగా ఇంటి నుంచి భోజనం, దుస్తులు, దుప్పట్లు, చెప్పులు వంటి వాటికి వెసులుబాటుకు ఇవ్వాలని కోరారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చిందికానీ, జైలు అధికారులు మాత్రం అంగీకరించలేదు.
ALSO READ : రామ భక్తులకు శుభవార్త.. హైదరాబాద్ టూ అయోధ్యకు ఫ్లైట్..
ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురానున్నారు. మరోవైపు సాధారణ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మద్య పాలసీ కేసు విచారణలో ఉన్నప్పుడు ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అందుకే బెయిల్ ఇవ్వవద్దని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్పై వాదనలు ఏప్రిల్ ఒకటికి వాయిదా వేశారు.