Atchannaidu latest news(AP news today telugu): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని స్వగృహంలో జరిగినట్లు తెలిపారు. కళావతమ్మ(90) వయోభారంతో అనారోగ్యం బారిన పడి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా అచ్చెన్నా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ క్రమంలో తల్లి మరణ వార్త విని వెంటనే స్వగ్రామానికి చేరుకున్నారు.
Also Read: నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత.. కేంద్రం ఆదేశాలు జారీ
కళావతమ్మ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం తెలిపారు. వీరితో పాటు పలువురు టీడీపీ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి ఓదార్చినట్లు తెలుస్తోంది.
అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ భర్త దాలినాయుడు. ఆయన 15 ఏళ్ల క్రితం కన్నుమూశారు. వీరికి నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెల సంతానం కలిగారు. పెద్ద కొడుకు ఎర్రన్నాయుడు 12 ఏళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే అచ్చెన్నా కుటుంబంలోని ప్రతీ ఒక్కరు రాజకీయాల్లోనే ఉన్నారు. దివంగత ఎర్రన్నాయుడు కూడా టీడీపీ హయాంలో పేరు పొందారు. రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉంది.