Tukkuguda Congress Meeting Updates: కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను విడుదల చేశారు. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్టులో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడినుంచి నేరుగా తుక్కుగూడ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారితో పాటు కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు.
అంతకుముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను అంతం చేయాలని చూశారని తెలిపారు. రాహుల్గాంధీ దేశం మొత్తం తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. బీజేపీ నేతలను ప్రశ్నిస్తే ఈడీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్ రాలేదని అన్నారు.