Suhasini met CM RevanthReddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు నందమూరి సుహాసిని. శనివారం ఉదయం సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేశారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు.
2018 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరపున సుహాసిని పోటీ చేశారు. అనూహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. అయితే కేవలం మర్యాద పూర్వకంగా భేటీ మాత్రమేనని చెబుతున్నారు.
ALSO READ: కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..?
అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం రేవంత్రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్లోని ముఖ్యంగా కూకట్పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ పరిధిలో నందమూరి సుహాసినికి మాంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆమెకు కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.