President Draupadi Murmu Presented Bharat Ratna(Morning news today telugu): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న అవార్డు గ్రహీతల కుటుంబాలకు వాటిని ప్రదానం చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారతరత్న అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీజేపీ నేత ఎల్ కే అడ్వాణి లకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించింది.
Also Read : స్టూడెంట్కి షాకిచ్చిన ఐటీ.. 46 కోట్లపై నోటీసు.. ఇదెలా?
రాష్ట్రపతి భవన్ లో శనివారం భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు భారతరత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు స్వీకరించారు. అలాగే చరణ్ సింగ్ ఠాకూర్ భారతరత్న అవార్డును ఆయన మనువడు స్వీకరించారు. ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్ ల అవార్డులను వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. ఇక ఎల్ కే అడ్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు.