Kartika Masam : శివుడు విష్ణువులకు అతి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం. ఈ మాసంలో ప్రతీ రోజూ పవిత్రమైనదనని కార్తీక పురాణం చెబుతోంది.ఈ సమయంలో దేవుడ్ని భక్తి, శ్రద్ధలతో కొలిస్తే అవి వారికి నేరుగా చేరతాయని నమ్మకం. ఈనెల మొత్తం భక్తులు, ఉపవాసాలు, వ్రతాలు, దానాలు ,పూజలు చేస్తుంటారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తల తీసుకోవాలి
భోజనం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. చాలామంది ఈ మాసంలో మాంసం జోలికి వెళ్లరు. ఉల్లిపాయను తీసుకోరు . ప్రత్యేకమైన డైట్ పాటించాలి. ఎంగిలి పదార్ధాలు తినకూడదు. ఉల్లిపాయతోపాటు ఉసిరిని తినరు. వంకాయి, ఉసిరి తినకూడదు. నెయ్యి, నూనె, మైదాతో తయారు చేసే వంటలకు దూరంగా ఉండాలి. సొరకాయ, గుమ్మడి కాయలతో చేసిన వంటలను తినకూడదు. ముల్లంగి, గుమ్మడి కాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.పగలంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేయలేని పక్షంలో ఉసిరికి దూరంగా ఉండాలి.
అలాగే శనగపప్పు, పెసరపప్పు, నువ్వులను తీసుకోకూడదు. ఆదివారం కొబ్బరి, ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. మద్యం, మాంసం వంటి వాటిని కూడా తీసుకోకూడదు. ఈ విధంగా కార్తీక మాసమంతా నియమనిష్టలను పాటిస్తూ ఆ పరమేశ్వరుడికి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనంపై ఉంటుంది.