Stock Market: భారీ అంచనాల మధ్య బాంబే స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. ఆదిలో లాభాలతో మార్కెట్ మొదలైంది. దీనికితోడు ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెన్స్ 180 పాయింట్లు పెరిగి 72 వేల 650 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 61 పాయింట్లు పెరిగి 22 వేల 066 పాయింట్ల వద్ద ట్రేడింగ్ సాగుతోంది.
ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 రూపాయల 31 పైసల వద్ద ప్రారంభమైంది. ముఖ్యంగా బీఎస్ఈ సూచీల్లో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. కాకపోతే బుధవారం ఉదయం ఆసియాలోని ప్రధాన మార్కెట్ల సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్ ఇదే జోరు కొనసాగుతుందా? లేదా అనే ప్రశ్న మదుపరులను వెంటాడుతోంది.