Errabelli Dayakar Rao Atrocities: కేసీఆర్ పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ఇప్పటికే అడ్డగోలుగా వ్యవహరించిన పోలీసుల బండారం బయటపడగా.. ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి చేసిన దౌర్జన్యాలు, అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలతో అప్పటి డీసీపీ రాధాకిషన్రావు తన ఫ్లాట్ను లాక్కోవడమే కాక, తన కుటుంబం నుంచి 50 లక్షలు వసూలు చేశాడంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి సీఎంం రేవంత్రెడ్డికి, డీజీపీకి మెయిల్ చేయడం కలకలం రేపుతోంది.
శరణ్ చౌదరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. గతేడాది ఆగస్టు 21న ఆఫీస్ కు వెళ్తుండగా సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులు వచ్చి బలవంతంగా సీసీఎస్ ఆఫీస్కు తీసుకెళ్లారంటూ ఆ మెయిల్లో ఆరోపించాడు శరణ్. రెండు రోజుల పాటు ఏసీపీ ఉమామహేశ్వరరావు తనను హింసించాడని, తన పేరిట ఉన్న ఫ్లాట్ను ఎర్రబెల్లి బంధువు విజయ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేశారన్నాడు. తాను అంగీకరించనందుకు బూటు కాళ్లతో ఉమామహేశ్వరరావు తన్నాడని, విపరీతంగా కొట్టాడని కంప్లైట్ చేశాడు.
Also Read: KTR Goa Politics: మహబూబ్నగర్ బైపోల్.. కేటీఆర్ గోవా పాలిటిక్స్..