EPAPER

Tragedy in Uttar Pradesh: సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా మంటలు.. నలుగురు చిన్నారులు దుర్మరణం!

Tragedy in Uttar Pradesh: సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా మంటలు.. నలుగురు చిన్నారులు దుర్మరణం!


4 Children Died due to Short Circuit: ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మీరట్ లోని వల్లవపురం గ్రామంలో జరిగిందీ విషాద ఘటన. జానీ – బబిత దంపతులకు సారిక (10), నిహారిక (8), సంస్కార్ (6), కలు (4)అనే నలుగురు పిల్లలున్నారు.

Also Read : హోలీ.. రంగుల కేళి.. మీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇలా విష్ చేయండి..


శనివారం (మార్చి 24) రాత్రి మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన తల్లి బబిత పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో జానీ కూలిపనికి వెళ్లడంతో.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం బబిత ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి బెడ్ షీట్ కు అంటుకోవడంతోనే చిన్నారులంతా మరణించారని తండ్రి జానీ పోలీసులకు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×