4 Children Died due to Short Circuit: ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మీరట్ లోని వల్లవపురం గ్రామంలో జరిగిందీ విషాద ఘటన. జానీ – బబిత దంపతులకు సారిక (10), నిహారిక (8), సంస్కార్ (6), కలు (4)అనే నలుగురు పిల్లలున్నారు.
Also Read : హోలీ.. రంగుల కేళి.. మీ మిత్రులు, శ్రేయోభిలాషులకు ఇలా విష్ చేయండి..
శనివారం (మార్చి 24) రాత్రి మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన తల్లి బబిత పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో జానీ కూలిపనికి వెళ్లడంతో.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం బబిత ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి బెడ్ షీట్ కు అంటుకోవడంతోనే చిన్నారులంతా మరణించారని తండ్రి జానీ పోలీసులకు తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.