Actor Parthasarathi deb passes away (breaking news of today in India): బెంగాల్ ఫేమస్ నటుడు పార్థసారథి దేబ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాత్రి 12 గంటల సమయంలో కన్నుమూశారు. చాలాకాలంగా ఓ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. గతనెలలో ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వారం కిందట పరిస్థితి విషమించింది. దీంతో గతరాత్రి సుమారు 12 గంటల సమయంలో మరణించారు. ఈ విషయాన్నిపార్థసారథి కుటుంబసభ్యులు తెలిపారు.
బులితెరపై పాపులర్ అయ్యిన పార్థసారథి..ఇటీవల ఆయన నటించిన ఫీచర్ ఫిల్మ్ రక్తబీజ్ విడుదలైంది. దాదాపు 200 ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. మూవీ, సీరియల్, వెబ్ సిరీస్లోనూ నటించిన అనుభవం ఆయన సొంతం. పశ్చిమబెంగాల్ మోషన్ పిక్చర్ ఆర్టిస్టు ఫోరమ్ కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మరణంపై ఫోరమ్ సంతాపం తెలిపింది. ఆయన మృతదేహాన్ని టెక్నీషియన్ స్టూడియోకు తీసుకెళ్లి నివాళులర్పిస్తామని వెల్లడించింది.
మరోవైపు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తన సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా వర్ణించారు. డైరెక్టర్, నటుడు, రచయిత కూడా పని చేశారు. హిందీ సినిమాలతోపాటు వివిధ భాషల్లోనూ పని చేశారు పార్థసారథి దేబ్.