EPAPER

Lok Sabha Elections 2024: కేంద్రానికి షాక్ ఇచ్చిన ఈసీ.. వికసిత భారత్ సందేశాలు ఆపండి

Lok Sabha Elections 2024: కేంద్రానికి షాక్ ఇచ్చిన ఈసీ.. వికసిత భారత్ సందేశాలు ఆపండి
Viksit Bharat Messages
Viksit Bharat Messages

Viksit Bharat: ‘వికసిత భారత్‌’ పేరిట వాట్సప్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి సందేశాలు వస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే వాటిని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.


కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాల జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం అందిరికి వాట్సాప్ లో వికసిత భారత్ పేరిట సందేశాలు పంపిస్తుంది. అయితే ఈ ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్రానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత కొందరి వాట్సాప్ కి ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో సందేశాలు వస్తున్నాయని ఈసీ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు వాటిని వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడే కొన్ని గంటల ముంది ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న లేఖను కేంద్రం అందరి వాట్సాప్ కు పంపింది. వికసిత భారత్ సంపర్క్ పేరిట అవి వస్తున్నాయి. అయితే నెట్ వర్క్ పరిమితులు కారణంగా మార్చి 16వ తేదీనా పంపిన సందేశాలు కొందరికి ఆలస్యంగా వస్తున్నాయని ఐటీ శాఖ ఈసీకి వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా కొందరికి ఈ సందేశాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ, తృణమాల్ కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశాయి.

బీజేపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఈ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన ఈసీ ఐటీ శాఖకు ఆదేశఆలు జారీ చేసింది. పారదర్శకతను నిర్ధరించేందుకు తాము తీసుకుంటున చర్యల్లో ఇదొక భాగం అని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.


Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×