Most Centuries In IPL(sports news in telugu): ఐపీఎల్ సీజన్ 17 మరొక్క రోజులో ప్రారంభం కానుంది. అయితే క్రికెట్ ప్రేమికులు అందరూ ఎవరెన్ని పరుగులు చేశారు? ఎవరెన్ని వికెట్లు తీశారు? ఎవరెన్ని సిక్సర్లు కొట్టారు? ఎవరెన్ని సెంచరీలు చేశారు? ఇలా అన్నీ లెక్కలు తీస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఐపీఎల్ మొత్తమ్మీద అత్యధిక సెంచరీలు చేసిన వారి వివరాలు తెలుసుకుందాం.
అందరిలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. తను 7 సెంచరీలు చేశాడు.
ఇలా చేశారు. తర్వాత రెండు సెంచరీలు చేసినవారు చాలా మంది ఉన్నారు. ఇంక ఒకొక్క సెంచరీతో సరిపెట్టినవారు కూడా ఉన్నారు. మొత్తమ్మీద ఐపీఎల్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆటగాళ్లు అందరూ కలిసి 87 సెంచరీలు చేశారు.
ఈ సారి 2024లో మరి ఈ సెంచరీల లిస్టును సెంచరీ దాటిస్తారో లేదో చూడాల్సిందే
పైన పేర్కొన్న సెంచరీ వీరులు చాలామంది ఇప్పుడు కూడా ఆడుతున్నారు. మరి వీరందరూ కలిసి మళ్లీ సెంచరీలతో కదం తొక్కుతారా? లేదా అన్నది చూడాలి.
మరోవైపు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబయి ఇండియన్స్ తరఫున మామూలు ఆటగాడిగా ఆడుతున్నారు. మరి హార్దిక్ పాండ్యాకు ఎటువంటి సలహాలిచ్చి నడిపిస్తాడో చూడాలి. అయితే తనకి అవసరం లేదు.
Also Read: ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
ఎందుకంటే ఆల్రడీ గుజరాత్ టైటాన్స్ కు కప్ తీసుకొచ్చాడు. రెండో ఏడాది రన్నరప్ గా నిలిచేలా చేశాడు. అందువల్ల తను ఆటగాడే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి, ఈ క్రమంలో వీరిద్దరూ ఎలా గ్రౌండ్ లో కలిసి ఆడుతారనేది అందరూ ఎదురుచూస్తున్నారు.
అటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ సెంచరీలు చేస్తారా? తమ జట్టు విజయంలో ఎలాంటి పాత్ర పోషిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక కొహ్లీపై పెద్ద బాద్యత ఉంది. ఎందుకంటే అమ్మాయిలు కప్ కొట్టారు. ఇక వీరు కూడా సాధించాల్సిన ఒత్తిడైతే ఉందని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.