EPAPER

Earthquake: మహారాష్ట్ర, అరుణాచల్ లో వరుస భూకంపాలు.. భయంతో జనం పరుగులు

Earthquake: మహారాష్ట్ర, అరుణాచల్ లో వరుస భూకంపాలు.. భయంతో జనం పరుగులు
Earthquake Hits Maharashtra Arunachal Pradesh
 

Earthquake Hits Maharashtra Arunachal Pradesh: మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ లోని గురువారం తెల్లవారుజామున వరుస భూకంపాలు వణికించాయి. మహారాష్ట్రలోని నాందేండ్ లో కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రకంపనలు జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర లోని హింగోలి నగరంలో గుగువారం ఉదయం పది నిముషాల వ్యవధిలో ఉదయం 6గంటల 8నిముషాలకు భూకంపం సంభవించింది.


ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.2 గా నమోదైంది. ఆ తర్వాత మళ్లీ 6:19 గంటలకు రెండో సారి భూమి కంపించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6 గా నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించారు.

Also Read: సెల్ఫీలు దిగేవారికి షాకిచ్చిన రైల్వేశాఖ.. అలా చేస్తే జరిమానా, జైలుశిక్ష ఖాయం..


భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఈ భూప్రకంపనల వల్లన ఎలాంటి ఆస్తి నష్టం కాని, ప్రాణ నష్టం కానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందే అరుణాచల్ ప్రదేశ్ లో గురువారం ఉదయం రెండుసార్లు భూకంపం సంభవించింది.

సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 01:49 గంటల సమయంలో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. రెండవ భూకంపం 03:40 సమయంలో రిక్టర్ స్కేలుపై 3.4గా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కమెంగ్ లో జరిగింది.

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×