EX MLA VITALREDDY JOIN TO CONGRESS ( political news today ): లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ ఎస్కు షాకులు ఇస్తున్నారు ఆ పార్టీలోని కీలక నేతలు. ఇప్పటికే చాలామంది ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీలోకి చేరిపోతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి చేరిపోయారు. ఆయన కాంగ్రెస్ తీర్థం పుచుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సీనియర్ నేతలతో మంతనాలు సాగించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డితో ఆయన భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సొంత గూటికి చేరుకున్నారు విఠల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలువురు నేతలు అక్కడే ఉన్నారు. అంతకుముందు మంత్రి సీతక్కతో సమావేశమైయ్యారాయన. ముధోల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన విఠల్ రెడ్డి, అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బీఆర్ ఎస్కి వెళ్లారు. 2018లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్నట్లు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఫాదర్ ముధోల్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే ముధోల్ నియోజకవర్గం విఠల్ ఫ్యామిలీకి కంచుకోట.