Chiranjeevi – Vishwambhara( celebrity news today): మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ భారీ డిజాస్టర్ తర్వాత తన నెక్స్ట్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా ఇప్పుడు తాను చేస్తున్న మూవీపై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎలాంటి రిస్క్ను అయినా చేయడానికి సిద్దమవుతున్నాడు.
అలాంటిదే తాజాగా మరో రిస్క్ చేశాడు. అది తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమని ఎంటర్ట్రైన్ చేయడానికి తమ అభిమాన హీరో చిరు ఇలాంటి పనులు చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. మరి చిరు ఏ పని చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ‘స్టాలిన్’ మూవీ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది.
ఈ మూవీలో నటి మీనాక్షి చౌదరీ, ఈషా చావ్లా, సురభి, రావు రమేశ్తో పాటు మరికొంత మంది నటీ నటులు భాగం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. అలాగే చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
Also Read : ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అల్లు అర్జున్.. పుష్ప 2 కోసమేనా?
ఇకపోతే చిరు కెరీర్లోనే ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో ఎనలేని అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి ఈ సినిమా సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ని హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించారు. అంతేకాకుండా ఆ తర్వాత కోకాపేటలో వేసిన ఓ సెట్లో పెళ్లి పాటను షూట్ చేశారు. ఇప్పుడు మరో షెడ్యూల్ను హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేశారు.
ఈ షెడ్యూల్లో చిరంజీవి ఎలాంటి రిస్క్ అయినా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బురదనీళ్లలో యాక్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దర్శకుడు వశిష్ట.. చిరుపై బురద నీళ్లలో భారీ ఫైట్ సీన్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే అందులో యాక్ట్ చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో విశేషం ఏంటంటే.. ఈ బురద సీక్వెన్స్లో నటించేందుకు చిరు ఎలాంటి డూప్ లేకుండా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఒంటి నిండా బురతో ఇబ్బంది పడుతున్నా సరే చిరు.. డూప్ను పెట్టుకోకుండా ఈ సన్నివేశాలను కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read :ఓటీటీలోకి వచ్చేసిన ఫైటర్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే..
అయితే ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా డూప్ను పెట్టి షూటింగ్ను కంప్లీట్ చేసేస్తున్నారు. కానీ 68 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ ఎలాంటి డూప్ను పెట్టుకోకుండా బురద సీక్వెన్స్లో నటిస్తున్నాడంటే నిజంగా చిరుకి హ్యాట్సాఫ్ చేయాల్సిందే అని ప్రేక్షకాభిమానులు అంటున్నారు.
ప్రస్తుతం ఆ బురద సీక్వెన్స్ షూటింగ్కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.