EPAPER

Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir: అయోధ్య రాముడిని దర్శించుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir: అయోధ్య రాముడిని దర్శించుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
Priyanka Chopra visit Ayodhya's Ram Mandir
Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir

Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir (today news telugu): బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఇలా అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయిన భారత నటి ఎవరంటే ముందుగా ప్రియాంక చోప్రా పేరే గుర్తొస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశ సినీ చరిత్రలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే తేడా లేకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. హాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో ప్రియాంక పూర్తిగా హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అంతేకాదు లాస్ ఎంజెల్స్ లో వందల కోట్లతో ఇళ్లు కొనుక్కుని అక్కడే మకాం వేసింది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ పోతూ ఉంటుంది. హాలీవుడ్ లో సెటిల్ అయినా.. తాను పుట్టిపెరిగిన దేశంలో జరిగే ఏ ఈవెంట్లో అయినా పాల్గొనేందుకు ప్రియాంక ఆసక్తి కనబరుస్తుంది. తాజాగా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చింది.


ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామజన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన ఫ్యామిలితో కలిసి వచ్చింది. బుధవారం ఉదయం తన భర్త నిక్ జోనస్, తన కూతురు మల్టీమారితో కలిసి అయోధ్య బాలక్ రామ్ ను దర్శించుకుంది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలో భారీ భద్రత నడుమ అయోధ్య ఎయిర్ పోర్టులో తమ కారు వద్ద ప్రియాంక తన భర్త కూతురితో కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంప్రదాయ దుస్తులను ధరించి అయోధ్య రాముడిని ప్రియాంక చోప్రా దర్శించుకుంది. పసుపురంగు చీరలో ఉన్న ప్రియాంక, తన కూతురు మల్టీని తన భుజాలపై ఎత్తుకుని కనిపించింది. గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న తన కూతురిని ఎత్తుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ఒకటైన కుర్తాను ప్రియాంక భర్త నిక్ ధరించి ఆలయాన్ని సందర్శించారు.


కాగా, జనవరి 22వ తేదీన అయోధ్య మందిరాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మహత్కార్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు విచ్చేశారు. అందులో బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా పాల్గొన్నారు. అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, నటి కంగనా రనౌత్, ప్రముఖ వ్యాపార వేత్త ముకేష్ అంబానీ కుటుంబంతో సహా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో రాలేకపోయిన ప్రియాంకచోప్రా.. తాజాగా నేడు రాముడిని దర్శించుకున్నారు.

 

Tags

Related News

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×