EC Notification for First Phase of Loksabha Elections : తొలివిడత పార్లమెంట్ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈసీ సెక్రటరీ సంజీవ్ కుమార్ ప్రసాద్ పేరుతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 16న ఈసీ పార్లమెంట్, ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తొలివిడత ఎన్నికలు 102 లోక్ సభ స్థానాలకు, 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్నాయి.
నోటిఫికేషన్ విడుదలవ్వడంతోనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 27 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. మార్చి 28న నామినేషన్ల పరిశీలన, మార్చి 30 వరకూ ఉపసంహరణకు అవకాశం ఉండనుంది. ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ.
Also Read : ఐటీ ఉద్యోగులకు నీటి కష్టాలు.. రోజుకు రూ.500 ఖర్చుచేయాల్సిందే..
తొలిదశ ఎన్నికల్లో 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే రాజస్థాన్ లో 25 లోక్ సభ స్థానాలుండగా తొలిదశలో 12 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్ లో 80 లోక్ సభ సీట్లు ఉండగా 8 స్థానాలకు తొలిదశలో పోలింగ్ జరగనుంది.