Bullet Train: బుల్లెట్ రైలును వేగంగా పట్టాలకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ ఇండియాలో పరుగులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైభవ్ స్వయంగా వెల్లడించారు. రైజింగ్ భారత్ సమిత్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తొలివిడత గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోర ప్రాంతాల మధ్య అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ రెండు ప్రాంతాల మధ్య పనులు చకచకా సాగుతున్నాయి. బుల్లెట్ రైలు పట్టాలకు ఎక్కించడానికి విధించిన గడువు ఆరేళ్లు. మొత్తం 2028 నాటికి పూర్తి చేయాలన్నది మంత్రి వైభవ్ ఆలోచన. ముంబై-అహ్మదాబాద్ ల మధ్య రైలు నడవనుంది. దీనికి సంబంధించిన ప్రతీ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు మంత్రి.
ఇదికాకుండా ఇండియాలోని పలు సిటీల్లో రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచేందుకు ఆలోచన చేసింది కేంద్రం. రెండేళ్ల కిందట పార్లమెంటు వేదికగా ప్రకటన చేసింది. ఏడు కారిడార్లలో ట్రాక్, టెక్నాలజీ అప్ గ్రేడ్ చేయాలన్నది అందులోని సారాంశం. భవిష్యత్తులో రైల్వే ఉద్యోగులు హ్యాపీగా ఉంటారన్నది మంత్రి మాట. గత ప్రభుత్వాలు రైల్వేను కేవలం పొలిటికల్ టూల్ గా మాత్రమే ఉపయోగించుకున్నారని చివరలో సెటైర్లు వేశారు మంత్రి అశ్విని.