IT Raids on Churneys Hotel(Hyderabad latest news): హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ టిఫిన్ హోటల్ చట్నీస్ కు ఐటీ అధికారులు షాకిచ్చారు. మంగళవారం ఉదయం నుంచీ ఐటీ అధికారులు ఆ హోటల్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ యజమాని అట్లూరి పద్మ.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలన్న విషయం తెలిసిందే. ఆమె ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె ప్రియ వివాహం జరిగింది.
Also Read : కవితపై సుకేశ్ సంచలన ఆరోపణలు.. “తీహార్ జైలుకు స్వాగతం అక్కా”
కాగా.. చట్నీస్ పేరుతో పదేళ్లుగా నగరంలో వ్యాపారం చేస్తున్నారు అట్లూరి పద్మ. హైదరాబాద్ వ్యాప్తంగా వారికి బ్రాంచీలున్నాయి. అలాంటి చట్నీస్ పై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేయడం సంచలనమైంది. ఐటీ అధికారుల దాడులపై చట్నీస్ యాజమాన్యం నుంచి గానీ.. ఐటీ అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు జీడిమెట్లలోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం.