Appeal in AP High Count on APPSC Group 1 Mains Cancel(AP updates): 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అప్పీల్ చేశాయి. ఇటీవలే సింగిల్ జడ్జి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చాయి. అయితే ఈ అప్పీల్ ను స్వీకరించిన హైకోర్టు అత్యవసర విచారణ కింద దీన్ని విచారించనున్నట్లు తెలిపింది. ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చేసిన అప్పీల్ పై మంగళవారం విచారణ జరుపుతామని ఏపీ ధర్మాసనం స్పష్టం చేసింది.
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ (27/2018)ను ఏపీ హైకోర్టు ఇటీవలే రద్దు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూల్యాంకనంలో కూడా అవకతవకలు ఉన్నట్లు ధర్మాసనం గుర్తించింది. ఈ రెండూ పేపర్ల మూల్యాంకనంలో సరైన పద్దతులు అనుసరించిన చట్టవిరుద్దమని చెప్తూ.. 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేసింది. తాజాగా నిబంధనలకు అనుగుణంగా ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ నిర్వహించింది. అయితే జవాబు పత్రాల ముల్యాంకనం మాన్యువల్ పద్దతిలో రెండు సార్లు చేసి తమకి కావాల్సిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసుకుని ఫలితాలు ప్రకటించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం మెయిన్స్ పేపర్లను పలుమార్లు మూల్యాంకనం చట్టవిరుద్ధమని ఏపీపీఎస్సీ విడుదల చేసిన జాబితాను రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేశారు. అయితే ఈ అప్పీల్ ను హైకోర్టు అత్యవసర విచారణ కింద మంగళవారం విచారించనున్నట్లు వెల్లడించింది.
Also Read: YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ..!
167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ప్రభుత్వం విడుదల చేసిన మెయిన్స్ జాబితాను రద్దు చేసింది. దీంతో అప్పట్లో ఉద్యోగాలు పొందినవారు ఒక్కసారిగా ఆందోళ చెందారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. ఉద్యోగుల ప్రయోజనాల కోసం తాము సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని గతంలోనే స్పష్టం చేసింది.