Bath After Eating : మనం అందరం ఫ్రెష్గా, ఉల్లాసంగా ఉండేందుకు రోజుకు రెండు పుటలా స్నానం చేస్తాం. ఇది చాలా మంచి అలవాటు కూడా. అయితే మనలో కొందరు స్నానం విషయంలో చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. తిన్న వెంటనే స్నానానికి వెళుతుంటారు. ఇలా చేయడం పెద్దపొరపాటు. పెద్దలు కూడా తిన్నవెంటనే స్నానానికి వెళితే తిడుతుంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉండే మానేయండి. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
దీన్ని కొందరు మూడనమ్మకం అనుకుంటారు. కానీ తిన్న వెంటనే స్నానం చేయకూడదనే దాని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. తిన్న వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలుతుందా..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలోని ప్రతి పనికి ఓ సమయం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే మన శరీరంలో జీర్ణశ్రయం తన పనిని మొదలు పెడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం ప్రారంభిస్తుంది. అందుకనే తిన్న వెంటనే స్నానం చేయకూడదు. దీనివల్ల శరీరం చల్లబడి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. శరీరం చల్లబడినప్పుడు జీర్ణక్రియకు అవసరమైన ఉష్ణోగ్రత అందదు. దీని వల్ల అజీర్ణం మరియు అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల రక్తనాళాల్లో సమస్య కూడా వస్తుంది. చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఒక రసాయన మూలకం ఉత్పత్తి అయి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రసాయనం రక్త నాళాలను విస్తరించి రక్తాన్ని నరాలు మరియు చిన్న నరాలకు వేగంగా ప్రయాణించేలా ప్రేరేపిస్తుంది. ఇది శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకండి.
Also Read : రంజాన్ ఉపవాసం.. ఈ ఫుడ్స్తో ఎనర్జిటిక్గా ఉండండి!
తిన్న తర్వాత చేయకూడనవి