Mudragada Padmanabham Joined YCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.
ఎపీలో గతకొంతకాలంగా ముద్రగడ ఏ పార్టీలో చేరుతారనే చర్చ తీవ్రంగా నడిచింది. తాజాగా ముద్రగడ ఈ చర్చలకు ముగింపు పలికారు. చివరకు వైసీపీలో చేరారు. కాపు ఉద్యమ నేతగా ప్రాచుర్యం పొందిన ముద్రగడ ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచారు.