Also Read: చింతలు తీర్చే దైవం.. మాచర్ల చెన్నకేశవుడు..!
బాబా కూడా మిగిలిన భక్తుల మాదిరిగానే అతడి తిట్లన్నీ వింటూ ఉండిపోయాడు. అయితే, ఇంత జరుగుతున్నా ఆ తిట్లు తింటున్న వ్యక్తి మాత్రం మౌనంగా తలదించుకుని బాధతో ఉండిపోయాడు. ఇంతలో మధ్యాహ్నం కావటంతో రోజుటిలాగానే బాబా లెండీ వనానికి బయలుదేరారు. బాబా మసీదు నుంచి వెళ్లటానికి సిద్ధమవుతున్న సంగతి గమనించిన ఆ తిట్ల దండకం చదివిన భక్తుడు.. అత్యంత వినయంగా బాబా వద్దకు వచ్చి నమస్కరించాడు. తానింతసేపు ఆ వ్యక్తిని తిడుతున్నా బాబా కూడా మౌనంగా ఉండిపోవటంతో తాను చేసింది సరైన పనే అనే ధీమాతో అతడు బాబా ముందు గర్వంగా నిలబడ్డాడు.
అయితే.. బాబా అతడిని దగ్గరకు పిలిచి, దూరంగా మలాన్ని తింటున్న పందిని చూపించాడు. ‘చూడు, ఆ పంది ఆ మలాన్ని ఎంత ఇష్టంగా తింటోందో.. ఇప్పటి దాకా నువ్వూ దాని మాదిరిగానే చాలా ఇష్టంగా నీ సాటి భక్తుడిని తిట్టావు. ఈ లోకంలో మనిషిగా పుట్టాలంటే కోటి జన్మల్లో పుణ్యం చేసి ఉండాలి. మరి నువ్వు నీకు దక్కిన ఈ మానవ జన్మను ఇతరులను కష్టపెట్టటానికి వాడుతున్నావు. నువ్వు చేసింది సరైనదో కాదో నువ్వే ఇక ఆలోచించుకో’ అన్నారు. ఆ మాట వినగానే ఆ భక్తుడికి తన తప్పేమిటో తెలిసొచ్చింది. వెంటనే బాబా పాదాల మీద పడి క్షమాపణ కోరాడు.
Also Read: మార్చి 17న హోలాష్టక్ ప్రారంభం.. ఈ రాశుల వారికి చెడు రోజులు స్టార్ట్
అప్పుడు బాబా ‘ ఇతరులను తిట్టటమంటే నిన్ను నువ్వు తగలబెట్టుకోవటమే. ఈ లోకంలో మనుషులుగా జన్మించిన వారంతా తమ పూర్వ జన్మ సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు. నీకు అతని ప్రవర్తన నచ్చకపోతే వదిలేసి నీ దారిన నువ్వు వెళ్లు. అంతేతప్ప అలాంటి వారిని విమర్శించటం సరికాదు. ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం. మనుషులు ఇలా పరస్పరం నిందించుకోవటం చూస్తే నాకెంతో బాధ కలుగుతుంది. ఇకపై ఇలాంటి పనికి పూనుకోవద్దు’ అని చెప్పి సాయిబాబా ముందుకు సాగిపోయారు.