TDP and YSRCP Candidates Lists: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమైంది. టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల రెండో లిస్టును గురువారం ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు తుది దశకు చేరుకుందని, వీలైనంత మంది అభ్యర్థుల పేర్లను రెండో జాబితాలో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన – బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందో వారికి ఒక స్పష్టత ఉందని, వారి అభ్యర్థుల లిస్టులను సమయానుసారం ప్రకటిస్తాయని తెలిపారు.
కాగా.. తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక టీడీపీ – జనసేన – బీజేపీ ల పొత్తులో భాగంగా జనసేనకు ముందుగా అనుకున్నదానికంటే సీట్ల కేటాయింపు తగ్గింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్ సభ, జనసేనకు 2 పార్లమెంట్ 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. అంటే టీడీపీ 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Also Read : 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణ నుంచి ఆరుగురు ఖరారు
ఇక ఇప్పటికే 12 అభ్యర్థుల జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్సీపీ.. ఈ నెల 16న తుది జాబితాను ప్రకటించనుంది. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తుదిజాబితా సిద్ధమైన నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు సీఎం జగన్. ముఖ్యంగా విభేదాలున్న నగరి, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల నేతలతో చర్చిస్తున్నారు.