Rythubadi Rajender Reddy got Invitation by IIIT Delhi: రైతుబడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఢిల్లీలోని “ఇంద్రప్రస్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీడీ)” ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఆంత్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్- 2024 లో ప్రసంగించాల్సిందిగా రైతుబడి సంస్థ ఐఐఐటీడీ ఆహ్వానించింది. రైతుబడి పాత్రను హైలెట్ చేస్తూ వ్యవసాయ గంగాల అవకాశాలపై చర్చించనున్నారు.
సోషల్ మీడియా వేదికల ద్వారా తెలుగు రైతులకు ఆయన సమగ్ర వ్యవాసాయ సమాచారాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ది చెందుతున్న సరికొత్త అవకాశాల గురించి యువతకు మంచి అవగాహన కల్పించడానికి రాజేందర్ రెడ్డి నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు అంతా ఆసక్తి చూపారు. ఈ గుర్తింపు సమగ్ర సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం ద్వారా గణనీయమైన స్థాయికి చేరుతుందని అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. రాజేందర్ రెడ్డికి ఒక్క ఫేస్ బుక్ పేజ్ లోనే దాదాపు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Also Read: మార్చిలో మండుతున్న ఎండలు.. జర జాగ్రత్త..
యూట్యూబ్, ఫేస్ బుక్ , ట్విట్టర్, ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో రైతు బడి ప్రస్థానాన్ని కొనసాగించడం ద్వారా అమూల్యమైన అనుభవాలను పంచుకోవడమే కాకుండా రైతుల్లో యువతలో సామాజిక భావాన్ని పెంపొందిస్తోంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ క్రియేటర్స్ అవార్డుల్లో వ్యవసాయ ఛానల్ విభాగంలో రైతుబడి సంస్థ అగ్ర భాగంలో నిలిచింది. ఈ సభకు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాజేంగర్ రెడ్డి హాజరవడం, ఈ సభలో ప్రసంగించడం ద్వారా రైతుబడి ప్రాముఖ్యత మరింత పెరగనుంది.