Pawan Kalyan Focus on Bhimavaram:భీమవరంలో పొలిటికల్ హీట్ ఏపీని వేడెక్కిస్తోంది. గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారైనా గెలుస్తారా..? పవన్ను భీమవరం ప్రజలు ఆదరిస్తారా..?
2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం బరిలో నిల్చున్నారు. ఆ ఎన్నికల్లో జనసేనాని వైఎస్సాఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ చేతిలో 8357 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్ధి రామాంజనేయులు పులపర్తి (అంజిబాబు)కు 54,036 ఓట్లు రాగా.. పవన్ కళ్యాణ్కు 62,285 ఓట్లు వచ్చాయి. కాగా వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్కు 70,642 ఓట్లు వచ్చాయి. దీంతో గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్పై 8357 ఓట్లతో విజయం సాధించారు.
Also Read: గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..
కాగా 2024 ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో పొలిటికల్ ఈక్వేషన్స్ డిఫరెంట్గా మారాయి. ఇప్పుడు అందరి చూపంతా భీమవరం పైరే ఉంది. తాజాగా రామాంజనేయులు జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పుడు జనసేనాని భీమవరం నుంచి పోటీ చేస్తే విజయానికి ఢోకా లేదని చెప్పొచ్చు.
రెండు పార్టీలకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పరిశీలిస్తే టీడీపీ-జనసేనకు కలిపి 116321 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ సారి సవన్ కళ్యాణ్ పోటీ చేస్తే విజయం పక్కా అని పొలిటికల్ టాక్ నడుస్తోంది.