అంతకుముందు సచిన్ టెండూల్కర్ 1994-95 సీజన్ ఫైనల్ లో పంజాబ్ పై ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. అప్పటికి సచిన్ వయసు 22 ఏళ్లు. కానీ ముషీర్ ఖాన్ 19 ఏళ్ల 14 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. దీంతో రంజీ ఫైనల్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్ గా గుర్తింపు పొందాడు.
విదర్భతో జరిగిన రంజీ ఫైనల్ మ్యాచ్ లో ముంబై రెండు కీలకమైన వికెట్లు కోల్పోయిన దశలో ముషీర్ ఖాన్ అద్భుతంగా ఆడాడు. ముంబై కెప్టెన్ ఆజింక్యా రహానే (73), శ్రేయాస్ అయ్యర్ (95) తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. ఈ మ్యచ్ తో శ్రేయాస్ అయ్యర్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. అందరినోళ్లూ మూయించాడు. అలాగే రహానె కూడా కెప్టెన్ కావడంతో బాధ్యతగా ఆడాడు.
Also Read: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీకి చోటు దక్కుతుందా? ఐపీఎల్ ప్రదర్శనే కీలకమా?
మొత్తానికి సర్ఫరాజ్ ఖాన్ , ముషీర్ ఖాన్ బ్రదర్స్ ఇద్దరూ ఒకేసారి జాతీయ జట్టులో ఆడే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఎందుకంటే అన్న సర్ఫరాజు ఇటీవలే ఇంగ్లాండ్ సిరీస్ లో అడుగుపెట్టి ధనాధన్ ఆడి అందరినీ మెప్పించాడు. ఎంతోమంది క్రికెటర్లు వస్తుంటారు, వెళుతుంటారు. కానీ సర్ఫరాజ్ మాత్రం తనలో ఒక ప్రత్యేకత ఉందని మాత్రం నిరూపించాడు.
ముషీర్ ఖాన్ వరుసపెట్టి ఇలా సెంచరీలు చేస్తూ, రేపు ఐపీఎల్ లో కూడా అదరగొడితే రాబోయే రోజుల్లో జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.