Virat Kohli Will Select for T20 World Cup..?: టీ20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి నుంచే భారత జట్టు కూర్పుపై చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ స్థానంపై ఊహగానాలు వస్తున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ప్రపంచకప్లో టీ20 జట్టులో కోహ్లీ స్థానంపై గ్యారెంటీ లేదనే టాక్ నడుస్తోంది. టీ20ల్లో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. మరి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2024కు ముందు సెలెక్టర్లు పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కోహ్లీ పొట్టి ఫార్మాట్లో జట్టు అవసరాలను తీర్చడానికి చాలా కష్టపడ్డాడు. అతనిని జట్టులో చేర్చుకోవడం అనేది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చేసే ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందంటున్నారు.
సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ , శివమ్ దూబే లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తారనే చర్చ నడుస్తోంది. దేశీయ , అంతర్జాతీయ మ్యాచుల్లో వారి ప్రదర్శనలు భారత టీ20 జట్టు కూర్పు నిర్దేశిస్తాయంటున్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.
Also Read: కమిన్స్ కి ఆస్ట్రేలియా చెక్.. టీ 20 కెప్టెన్ గా మార్ష్ ?
అజిత్ అగార్కర్ జట్టు ఎంపికలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనే ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ ఆటగాళ్లకు మాత్రమే కాకుండా జట్టు ఎంపికకు కీలకంగా మారింది.