Tejas Aircraft Crashes In Rajasthan: రాజస్థాన్ లో తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. జైసల్మేర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు అధికారులు ఆదేశించారు.
రాజస్థాన్ లో తేజస్ యుద్ధ విమాన శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో సైనిక విన్యాసాలు చేస్తున్నారు. భారత్ శక్తి పేరిట ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోగానే మంటల చెలరేగాయి. దీంతో తేజస్ యుద్ధ విమానం పూర్తిగా దగ్ధమైంది.
Also Read: హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీ.. కాసేపట్లో ప్రమాణస్వీకారం..
తేజస్ యుద్ధ విమానాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలకు లోనుకాలేదు. తొలిసారిగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కారణాలపై ఆరా తీస్తున్నారు. పైలెట్ తప్పిదం వల్ల జరిగిందా? సాంకేతిక సమస్యలు తలెత్తాయా? ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.