India successfully tested Mission Divyastra-Agni 5 Missile: భారత్ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ..ఆర్డీవో మరో విజయం సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణికి బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు.
అగ్ని-5 మిషన్ దివ్యాస్త్రను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎట్రీ వెహికల్ సాంకేతికతతో డెవలప్ చేశారు. మిషన్ దివ్యాస్త్ర అగ్ని-5ను ఒకే క్షిపణి సాయంతో వార్ హెడ్లను వివిధ టార్గెట్ పై ప్రయోగించే అవకాశం కలుగుతుంది.
అగ్ని-5కి 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. అలాగే అణ్వాయుధాల తీసుకెళ్లే సత్తా కూడా ఉంది. చైనాకు ఈ విషయంలో సామర్థ్యం ఉంది. ఆ దేశం వద్ద డాంగ్ ఫెంగ్ -41 లాంటి క్షిపణులు ఉన్నాయి. ఈ క్షిపణులు 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన సామార్థ్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే అగ్ని-5 ను రూపొందించింది.
Read More: పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలుకు చర్యలు.. నోటిఫికేషన్ జారీ..
మిషన్ దివ్యాస్త్ర అగ్ని-5 ఆసియా పరిధిలోనికి ఏ దేశంలోకైనా దూసుకెళ్లగల సత్తా ఉంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు రూపొందించిన క్షిపణులు కనిష్టంగా 700 కిలోమీటర్లు, గరిష్టం 3,500 కిలోమీటర్లు మధ్య దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు భారత్ రక్షణ బలగాలకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.