Janasena Announced Candidate for Nidadavole Assembly Constituency: ఏపీ ఎన్నికల్లో భాగంగా జనసేన మరో అభ్యర్థిని ప్రకటించింది. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా కందుల దుర్గేశ్ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.
కందుల దుర్గేశ్ ముందుగా రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా ఆ సీటును తెలుగు దేశం పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తేలడంతో అతనికి జనసేన నిడుదవోలు స్థానాన్ని కేటాయించింది.
టీడీపీ-జనసేన ముందుగా పొత్తు పెట్టుకున్నప్పటికీ తాజాగా బీజేపీ కూడా వారితో జత కట్టింది. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.