భారత్ చేతిలో సిరీస్ కోల్పోయినప్పటికి ఇంగ్లాండ్ 111 పాయింట్లతో మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ఇక న్యూజిలాండ్ 101 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 99 పాయింట్లతో తర్వాత స్థానంలో ఉంది.
ఇకపోతే వన్డేల్లో చూస్తే 121 పాయింట్లతో టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంటే, 110 పాయింట్లతో సౌతాఫ్రికా మూడో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో పాకిస్తాన్ (109), న్యూజిలాండ్ (102) ఉన్నాయి.
Read More: గిల్ ని గిల్లిన బెయిర్ స్టో.. మధ్యలో సర్ఫరాజ్ ఎంట్రీ
టీ 20ల్లో కూడా 266 పాయింట్లతో టీమ్ ఇండియా నెంబర్ వన్ గా ఉంది. తర్వాత ఇంగ్లాండ్ (256), ఆస్ట్రేలియా (255), న్యూజిలాండ్ (254), పాకిస్తాన్ (249) వరుసగా ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి.
ఇలా ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉంది.
వీటన్నింటితో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో కూడా టీమ్ ఇండియా 68.56 శాతంతో మొదటి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో 60 శాతంతో న్యూజిలాండ్, 59.09 శాతంతో ఆస్ట్రేలియా నిలిచాయి. ఇలా నాలుగింటిలో కూడా టీమ్ ఇండియా అగ్రస్థానం దక్కించుకుని ప్రపంచ క్రికెట్ లో రారాజుగా ఉంది.